గువాహటి: అసోంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న అసోంలోని తేజ్పూర్లో స్వల్పంగా భూమి కంపించగా, తాజాగా మోరిగాంలో భూ ప్రకంపణలు వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.13 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, గురువారం ఉదయం 10.30 గంటలకు తేజ్పూర్ సమీపంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయ్యింది.
అసోంలో గత కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా భూకంపాలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం 7.22 గంటలకు సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్రతత భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మే 1న (శనివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్పూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.3 గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి