వికారాబాద్, మార్చి 30, (నమస్తే తెలంగాణ): సమీ కృత మార్కెట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అం దుక నుగుణంగా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నాలుగు మున్సి పాలిటీలైన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్లో సమీకృత మార్కెట్ల ఏర్పా ట్లపై మంత్రి సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యా లయంలో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమీకృత మార్కెట్ల నిర్మాణం కొరకు కనీసం రెండు ఎక రాల చొప్పున ఇప్పటికే స్థలాలను గుర్తించా మన్నారు. ఈ నిర్మాణపు పనులను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా అన్ని హంగులతో అన్ని రకా ల వస్తువులు వెజ్, నాన్వెజ్లు ఒకే దగ్గర లభించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మార్కెట్ వద్ద మహిళల కోసం డ్వా క్రా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమిబసు స్పందిస్తూ జిల్లాలో దాదాపు అన్ని పనులు చివరి దశలో ఉన్నాయని కొన్ని సమ స్యల కారణంగా మిగిలివున్న పనపులను జూన్ 15 వరకు పూర్తి చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అన్ని మున్సి పాలిటీలకు కేటాయించిన ఆటో ట్రాలీలతో ప్రతి రోజు అన్ని మున్సిపాలిటీల్లో చెత్తను సేకరి స్తున్న ట్టు కలెక్టర్ వివరించారు. వికారాబాద్ పట్టణం లో రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేయా లని మున్సిపల్, ఆర్ అండ్బీ అధికారులను ఆదే శిం చారు.
సెంట్రల్ లైటింగ్, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టి 15 రోజుల్లో ఒక్కో మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయ నున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ఎన్టీఆర్, బీజేఆర్,ఎన్నెపల్లి జంక్షన్ల వద్ద సుందరీకరణ ప నులను చేపట్టాలన్నారు.రూ. కోటితో శివారెడ్డి పేట చెరువు కట్ట సుందరీకరణ పనులను చేపట్టా లని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వికారాబాద్, పరిగి, తాండూరు శాసన సభ్యులు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి, రాష్ట్ర విద్యా మౌళిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్గౌడ్,జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, ము న్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
నల్లా కనెక్షన్కు ఆధార్ లింకేజీ గడువు పెంపు