హుస్నాబాద్టౌన్, జూన్ 27: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల పర్యవేక్షణ కోసం అధికారులను నియమించారు. జూలై 1వ తేదీ నుంచి వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి హరితహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాలు తదితర సమస్యలను పరిష్కరించడానికి వార్డు అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న, కమిషనర్ రా జమల్లయ్య ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డులో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. పట్టణ ప్రగతిని ఉద్య మంలా చేపట్టాలని చైర్పర్సన్ సూ చించారు. సమావేశంలో వార్డు అధికారులను నియమించారు.
వార్డులో ‘పట్టణ ప్రగతి’ అధికారుల నియామకం
1వ వార్డుకు జి.ప్రశాంత్, 2వ వార్డుకు ఎ.వనాకర్, 3వ వార్డుకు ఎన్.రాజమౌళి, 4వ వార్డు ఎం.రాజశేఖర్, 5వ వార్డు ఎండీ సాదిక్, 6వ వార్డు డి.కృష్ణ, 7వ వార్డు పి.సృజన్, 8వ వార్డు కె.రమేశ్, 9వ వార్డు టి.వెంకటస్వామి, 10వ వార్డు ఎండీ ఆదాం, 11వ వార్డు జి.భారతి, 12వ వార్డు డి.రవికుమార్, 13వ వార్డు ఎన్.సహదేవ్, 14వ వార్డు బి.రవి, 15వ వార్డు ఎం.రాజు, 16వ వార్డు పి.శ్రీకాంత్, 17వ వార్డు ఎ.దేవయ్య, 18వ వార్డు ఎ.నరేశ్, 19వ వార్డు పి.ప్రశాంతి, 20వ వార్డు కె.రవీందర్ను నియమించారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని చైర్పర్సన్ రజితావెంకన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని 20వ వార్డు కమి టీ సమావేశానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ హాజరైన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో పట్టణాన్ని మరింతగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చిందన్నారు. వార్డు ల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి పట్టణ ప్రగతి దోహదపడుతుందన్నారు. ప్రతి వార్డులో హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు వార్డు కమిటీలు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్ సుప్రజానవీన్రావు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, మున్సిపల్ కోఆష్షన్ సభ్యుడు అయిలేని శంకర్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, వార్డు అధికారి కొరెపు రవి పాల్గొన్నారు.