సిరిసిల్ల టౌన్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరైనట్లు సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి తెలిపారు. అకాడమీ ఏర్పాటుకు జయప్రకాశ్నగర్లో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కళతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీకుమార్, డీఎస్డీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.