గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణ
నారాయణపేట, ఏప్రిల్ 6 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రా మకృష్ణ అన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్గా నియమితులైన కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి శ్యాసం రామకృష్ణ మంగళవారం నారాయణపేట గ్రం థాలయ శాఖలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో అభివృద్ధి కి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తీసుకొని పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మనోజ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
‘గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తాం’
కోస్గి, ఏప్రిల్ 6 : కోస్గిలో నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తామని, ప్రస్తుతం ఆర్ఎన్బీ భవనంలో తా త్కాలికంగా కార్యాలయం ఉందని త్వరలోనే నూతన భవనం నిర్మిస్తామ ని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శా సం రామకృష్ణ అన్నారు. కోస్గి గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా గ్రంథాలయ కా ర్యదర్శి మనోజ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 9 గ్రంథాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు మినహా మిగతావన్నీ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. జిల్లాలో రూ. 20 లక్షలు మాత్రమే నిధులున్నాయని, సొంత స్థ లాలు గ్రంథాలయాలపై ఉంటే నిధులు సేకరిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజ లు చెల్లించే పన్నుల్లో 8 శాతం నిధులు గ్రంథాలయాలకు ఇవ్వాలని, ఆ నిధులు సేకరించి ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం కోస్గి గ్రంథాలయ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక గ్రంథాలయ సిబ్బంది చైర్మన్ను సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, నాయకు లు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో కాంగ్రెస్కు షాక్.. అన్నకు వ్యతిరేకంగా బీజేపీకి హస్తం నేత మద్దతు
121 ఏండ్లలో మూడోసారి ఉష్ణమండలంగా భారత్!