న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బుధవారం ధోనీ బర్త్ డే సందర్భంగా వెరైటీగా తనదైన స్టైల్లో విషెస్ చెప్పిన అతడు.. గురువారం (జులై 8) గంగూలీ (49) బర్త్డేకు కూడా అలాగే విషెస్ చెప్పాడు. దీనికోసం అతడు మన రాజమౌళి తెరకెక్కిస్తున్న తెలుగు మూవీ ఆర్ఆర్ఆర్ పోస్టర్ను వాడుకోవడం విశేషం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ బైక్ వెళ్తున్న పోస్టర్ను ఈ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలుసు కదా. అదే పోస్టర్లో తనది, గంగూలీ ఫొటోలు పేస్ట్ చేసి, బైక్పై దాదా అని రాసి వీరూ విషెస్ చెప్పాడు.
దాదా బైక్ను దాదాతో కలిసే రైడ్ చేయడమంటే ఇదే. ఆ ఐదేళ్లుతో దాదాతో ప్రయాణం కూడా ఇలాగే సాగింది. రాబోయే ఏడాదిలో పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని వీరూ కామెంట్ చేశాడు. ఈ ఫొటోను తన ఫేస్బుక్లో అతడు పోస్ట్ చేశాడు.
ఇక ధోనీని విష్ చేసినట్లే ఇటు ట్విటర్లోనూ వరుస ట్వీట్లతో గంగూలీకి సెహ్వాగ్ బర్త్డే విషెస్ చెప్పడం విశేషం. దాదాకి ఉన్న క్రేజ్ చాలా కొద్ది మందికే సాధ్యం అంటూ అతడు గంగూలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక ధోనీకి చెప్పినట్లే గత నాలుగేళ్లుగా దాదా బర్త్డే రోజు తాను చేసిన ట్వీట్లను మరోసారి అతడు పోస్ట్ చేశాడు.