న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి( Virat Kohli )పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్ మణిందర్ సింగ్. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 78 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. కెప్టెన్ కోహ్లి మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీనిపై మణిందర్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్కు ముందు కోహ్లి ఏం చెప్పాడో అది తాను చేసి చూపించాలని అన్నాడు. ఈ మ్యాచ్కు ముందు కోహ్లి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఇంగ్లండ్ కండిషన్స్లో బ్యాట్స్మెన్ తమ అహాన్ని జేబులో పెట్టుకోవాలని అన్నాడు. అతడు చెప్పింది నిజం. ఇతర పిచ్లపై తాను డామినేట్ చేసినట్లుగా ఇంగ్లండ్ పిచ్లపై చేయకూడదు అని మణిందర్ అన్నాడు.
ఇవి ఇండియన్ పిచ్లు కావు
తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఈఎస్పీఎన్ క్రికిన్ఫో షోలో మణిందర్ మాట్లాడాడు. వచ్చీ రాగానే డ్రైవ్ షాట్లు ఆడటానికి ఇవేమీ ఇండియన్ పిచ్లు కాదని ఈ సందర్భంగా మణిందర్ అన్నాడు. అతడు మరింత సమయం క్రీజులో ఉండాలి. గత టూర్లో ఆడినట్లే ఆడాలి. ఆ టూర్లో అతడు 600 పరుగుల వరకూ చేశాడు. బంతి ఎలా వస్తుంది, ఎలా కదులుతుందో అర్థం చేసుకున్న తర్వాత షాట్లు ఆడాలి. ఇవేమీ ఫ్లాట్ ఇండియన్ పిచ్లు కావు. అక్కడైతే ఓ అడుగు ముందుకేసి ఈజీగా డ్రైవ్ షాట్లు ఆడొచ్చు. అందుకే చెప్పేది కోహ్లి తాను చెప్పింది చేయాలి. తన అహాన్ని జేబులో పెట్టుకోవాలి అని మణిందర్ అన్నాడు.
చేసిన తప్పులే మళ్లీ..
2014లో తొలిసారి తాను ఇంగ్లండ్ టూర్కు వెళ్లినప్పుడు చేసిన తప్పులనే కోహ్లి మళ్లీ చేస్తున్నాడని మణిందర్ అభిప్రాయపడ్డాడు. 2018లో తాను ఎలా ఆడాడో గుర్తు చేసుకొని దాని నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పాడు. అతడు తన శరీరానికి చాలా దూరంగా వెళ్తున్న బంతులను ఆడుతున్నాడు. రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. 2014లో అతడు ఎలా ఔటయ్యాడో ఈసారి కూడా అలాగే అవుతున్నాడు. బాల్ ఆడాలా లేదా వదిలేయాలా అని ఆలోచించాలి. తొలి రెండు టెస్టుల్లో మన బ్యాట్స్మెన్ ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్తున్న బాల్స్ను వదిలేశారు. కానీ ఈ మ్యాచ్లో మళ్లీ అది మరచిపోయి మూల్యం చెల్లించారు అని మణిందర్ చెప్పాడు.