నంగునూరు, జూలై 4 : తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ దయతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మండ లంలోని మగ్దూంపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడకపోతే ఇక్క డి ప్రాంతానికి కాళేశ్వరం గోదావరి జలాలు వచ్చేవి కావన్నారు. కాలం కాకపోయిన గుంట ఎండకుండా బం గారంలాంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారని ఆనం దం వ్యక్తం చేశారు. రంగనాయకసాగర్ను నింపి కాల్వల ద్వారా ప్రతికుంట, చెరువు నింపుతామని మంత్రి తెలిపారు. పెద్దమ్మతల్లి దీవెనలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని పూజలు చేసిననట్లు చెప్పారు.
టీకా వేసుకోండి.. మాస్క్ ధరించండి
18 ఏండ్లు నిండిన వారంతా కరోనా టీకా వేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. అమ్మవారి దయతో ముందస్తుగానే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
వరివెద సాగు, ఆయిల్ పామ్సాగుపై రైతులు దృష్టి సారించాలి
రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. వరి వెద సాగు చేయడంతో ప్రతి ఎకరానికి రూ.8 నుంచి 10 వేల ఆదా యం పెరుగుతుందన్నారు. వెదసాగుతో రైతులకు నారుమళ్లు తయారు చేసుకోవడం, కలుపు, నాట్లు వేసుకోవడానికి అయ్యే ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడి కూడా అధికంగా వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఏడాదికి లక్షా 20 వేల ఆదాయం సమకూర్చే విధంగా ఆయిల్ పామ్ సాగు దిగుబడి వస్తుందన్నారు. అంతకుముందు పెద్దమ్మ ఆలయంలో అమ్మవారికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరైన మంత్రికి ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచు పద్మ, చక్రపాణి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ చైర్మన్ సోంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాల్త్న్రం, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.