ఓల్డ్ట్రాఫర్డ్: ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరగాల్సిన అయిదవ టెస్టు అకస్మాత్తుగా రద్దు అయిన విషయం తెలిసిందే. టీమిండియా సిబ్బందిలో కరోనా కేసులు నమోదు కావడంతో.. ఆ టెస్టు మ్యాచ్ను రద్దు చేశారు. అయితే చివరి కొన్ని గంటల వరకు మ్యాచ్ను నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నా.. ఆఖరి క్షణాల్లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన ప్రకటనతో క్లారిటీ వచ్చింది. అయితే ఆ మ్యాచ్ను రద్దు చేయడానికి కెప్టెన్ కోహ్లీ కారణమని తెలుస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ కొన్ని విషయాలు తెలిపారు. క్రికెట్ డాట్కామ్తో ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ ముందు రోజు అర్థరాత్రి కెప్టెన్ కోహ్లీ .. బీసీసీఐకి లేఖలు రాసినట్లు గోవర్ వెల్లడించారు. వెబ్పోర్టల్తో మాట్లాడిన గోవర్.. ఓ రాత్రి చోటుచేసుకున్న పరిణామాల వల్లే మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చినట్లు తెలిపారు.
మ్యాచ్ రద్దు అయిన వెంటనే .. ఐపీఎల్ కారణంగా ఆ మ్యాచ్ను రద్దు చేసి ఉంటారని ఊహాగానాలు వినిపించాయి. కానీ గోవర్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ.. ఐపీఎల్ వల్లే మ్యాచ్ను రద్దు చేస్తే, అప్పడు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచినట్లు అని తెలిపారు. గత పర్యటనలో టెస్టు క్రికెట్ గురించి విరాట్ ఎంతో ముఖ్యమైన కామెంట్లు చేశారని, కానీ ఇప్పుడు జరిగిన తీరు నిరాశనే మిగిల్చిందన్నారు.
ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దవడంపై మొత్తానికి స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్.. ముందుగానే ఇక్కడికి రావాల్సి రావడం దురదృష్టకరమని అన్నాడు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కనీసం ఐపీఎల్ కోసమైనా సురక్షితమైన బయో బబుల్ ఏర్పాటు చేయాలని కోహ్లి అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని జూనియర్ ఫిజియో యోగేశ్ పార్మర్ కరోనా బారిన పడటంతో చివరి టెస్ట్ బరిలోకి దిగడానికి కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్ నిరాకరించారు.
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగవ టెస్టుకు ముందు లండన్లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత రవిశాస్త్రి కోవిడ్ పాజిటివ్గా తేలారు. దీంతో కోహ్లీపై కూడా విమర్శలు వచ్చాయి.