శంకరపట్నం, ఏప్రిల్ 19: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం తాడికల్ సింగిల్విండో చైర్మన్ కేతిరి మధూకర్రెడ్డి ఆధ్వర్యంలో తాడికల్, ఇప్పపల్లి, అంబాల్పూర్, వన్నారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, రైతులు తాలు పట్టి ధాన్యం తీసుకురావాలని సూచించారు. నిర్వాహకులు ఎఫ్ఏక్యూ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు జరుపాలని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులకు తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఆయా గ్రామాల్లో ఏవో ఆర్ శ్రీనివాస్, సర్పంచ్ కీసర సుజాత, ఎంపీటీసీ బుద్దార్థి వరలక్ష్మి, వైస్ చైర్మన్ నరహరి వెంకటరమణారెడ్డి, ఉప సర్పంచులు మడ్డి రవి, వెంగల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
మెట్పల్లి సింగిల్ విండో పరిధిలో..
మెట్పల్లి సింగిల్ విండో పరిధిలోని కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, ఆముదాలపల్లి గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో సదయ్య మాట్లాడుతూ, రైతులు ధాన్యంతో పాటు ఏఈవోల నుంచి టోకెన్లు, ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ తీసుకొని కేంద్రానికి రావాలని తెలిపారు.
నేడు తిమ్మాపూర్లో..
తిమ్మాపూర్, ఏప్రిల్ 19 : తిమ్మాపూర్లో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించనున్నట్లు మండల ఏపీఎం రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.