న్యూఢిల్లీ : ఢిల్లీలో మద్యం సేవించాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ వయసుపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా వెల్లడించారు. ఈ మేరకు ఎక్సైజ్ విధానంలో ఢిల్లీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలు ఢిల్లీలో లేవు. కొత్తగా మద్యం దుకాణాలను ఓపెన్ చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. మద్యం తాగే వయసును 21 ఏండ్లకు తగ్గించడంతో దేశంలో ఇతర రాష్ర్టాల జాబితాలో ఢిల్లీ చేరింది. దేశంలోని పలు రాష్ర్టాల్లో మద్యం సేవించే అర్హత వయసు 21 ఏండ్లు మాత్రమే.