స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వలన వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మూవీ షూటింగ్ తిరిగి మొదలు పెట్టబోతున్నారు. కొద్ది రోజులు హైదరాబాద్లో షూటింగ్ చేసాక గోవా వెళ్లనున్నారట.
గోవాలో అల్లు అర్జున్- రష్మికపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట సుకుమార్. దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ ఈ షెడ్యూల్ ఉంటుందని, ఈ షెడ్యూల్తో మూవీ షూటింగ్ పూర్తైనట్టే అని అంటున్నారు. గోవాలోని అందమైన ప్రదేశాలలో బన్నీ- రష్మికకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. యాంకర్ అనసూయ కీలకపాత్రలో కనిపించనుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.