ఇన్స్టాగ్రామ్లో విరాట్కు ఫుల్ క్రేజ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతడిని 150 మిలియన్ల (15 కోట్లు) మంది ఫాలో అవుతున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కోహ్లీనే. అంతేగాక ఆసియా ఖండం నుంచి సైతం ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి అతడే. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రీడాకారుల్లో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్మర్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్బుక్ (48 మిలియన్లు)లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో విరాట్ ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా రూ. 5 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు.