న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరుకు రూ. 2 కోట్లు విరాళంగా ఇవ్వడంతో పాటు 11 కోట్లు సేకరించిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారి అయాన్ష్ గుప్తాకు ఆర్థిక సహయం అందించింది. స్పైనల్ మస్కులర్ ఆట్రఫీ వ్యాధితో బాధపడుతున్న అయాన్ష్కు రూ.16 కోట్ల విలువైన మందులు అవసరమవడంతో చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో విరాళాల కోసం అభ్యర్థించగా.. విరుష్కతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు ముందుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం అయాన్ష్ ఆరోగ్యం కుదుటపడటంతో.. సాయం చేసిన కోహ్లీ, అనుష్కకు చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.