హర్యానా, యూపీలో కొనేందుకు నిర్ణయం
లబ్ధిదారులతో కలిసి వెళ్లిన అధికారులు
మహారాష్ట్ర బర్రెల కొనుగోలు నిలిపివేత
మంత్రి కొప్పుల ఆదేశాలతో మార్పు
క్వాలిటీ కోసమేనని ఎస్సీ కార్పొరేషన్ వెల్లడి
వరంగల్రూరల్, మార్చి 23(నమస్తేతెలంగాణ): మినీ డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు నార్త్ ఇండియా బర్రెలు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించిం ది. ఈ మేరకు బర్రెలు కొనేందుకు అధికారులు హ ర్యానా, ఉత్తరప్రదేశ్కు లబ్ధిదారులతో కలిసి వెళ్లారు. దళితులకు 60శాతం సబ్సిడీపై బర్రెల పంపిణీకి ప్రభు త్వం పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ రూరల్ జిల్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో తొలి విడుత ఆరు మండ లాల్లో 611 మందికి మినీ డెయిరీ యూనిట్లు అందిం చాలని నిర్ణయించారు. చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, ఆత్మకూరు, దామెర మండలా ల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి బర్రెల సంరక్ష ణ, పాలసేకరణ, విక్రయంపై శిక్షణ ఇప్పించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.4 లక్షలు కాగా 60శాతం సబ్సిడీ (రూ.2.40 లక్షలు) పోను 40శాతం (రూ. 1.60 లక్ష లు) బ్యాంకర్లు రుణంగా అందిస్తారు. మొత్తం 611 యూనిట్ల విలువ రూ.24.44 కోట్లు కాగా సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.14,66,40,000 విడుదల చే సింది. ఈ ఆరు మండలాల్లో మినీ డెయిరీ యూనిట్ల లబ్ధిదారులతో పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డా యి. పాల సేకరణకు ఏడు రూట్లను సైతం అధికారులు గుర్తించారు. ఈ రూట్లలో 72 కేంద్రాలను విజయ డె యిరీ నిర్వహించనుంది.లీటరు పాలపై అదనంగా రూ. 4 ప్రోత్సాహం ఇవ్వనుంది. ప్రతి లబ్ధిదారుకు నాలుగు బర్రెల చొప్పున ఇస్తారు. వీటిలో మొదట రెండు కొనిచ్చా క ఆరు నెలల తర్వాత మిగతా రెండు అందజేస్తారు.
మంత్రి కొప్పుల ఆదేశాలతో..
బర్రెల కొనుగోలుకు ప్రభుత్వం కొన్ని రాష్ర్టాలను సూచించింది. గత జనవరి మూడో వారంలో లబ్ధిదా రులతో కలిసి అధికారులు మహారాష్ట్రకు వెళ్లారు. నాగ పూర్ ప్రాంతంలో దాదాపు 300 బర్రెలు కొని తెచ్చా రు. ఫిబ్రవరి మొదటి వారంలో 150 మందికి ఒక్కొ క్కరికి రెండు చొప్పున అందజేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పంపిణీ కార్యక్ర మంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో క్వాలిటీ బర్రె లు ఉంటాయని, మిగతావి అక్కడి నుంచి తేవాలని సూచించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం వంద మంది లబ్ధిదారులతో కలిసి అధికారులు రైలులో హ ర్యానాకు వెళ్లారు. మరో 50మంది లబ్ధిదారులతో కొం దరు ఉత్తరప్రదేశ్ వెళ్లినట్లు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికా రి సురేశ్ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో లబ్ధిదా రులకు బర్రెలు పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు చెప్పారు.