దుబాయ్: ఐపీఎల్ ( IPL 2021 ) అంటేనే బ్యాట్స్మెన్ గేమ్. బౌలర్లను చితకబాదుతూ గ్రౌండంతా బౌండరీల వర్షం కురిపిస్తుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఐపీఎల్లో ఓ బౌలర్ సంచలన ప్రదర్శనం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన, సంచలన బౌలింగే చేశాడు రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ కార్తీక్ త్యాగి. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 4 పరుగులే అవసరం ఉండగా.. కేవలం ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
చివరి ఓవర్లో తొలి బంతికి 0, రెండో బంతికి 1 పరుగు, మూడో బంతికి వికెట్, నాలుగో బంతికి 0, ఐదో బంతికి వికెట్, చివరి బంతికి 0 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఈ సంచలన చివరి ఓవర్కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.