చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా చేజార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి పోరులో హర్మన్ప్రీత్ బృందం 8 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేశారు. స్మృతి మందన (70) అర్ధశతకంతో మెరువగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (36) వేగంగా ఆడింది. అనంతరం వ్యాట్ (89 నాటౌ ట్), స్కీవర్ (42) రాణించడంతో.. ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.