బెంగళూరు, జూలై 3: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 15 ఏండ్ల కిందటి భూకేటాయింపుల కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కర్ణాటక లోకాయుక్త పోలీసులు రూపొందించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. 2006లో యెడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 434 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి 2013 లో కేసు నమోదైంది.