మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 28: కజకిస్థాన్ వేదికగా జరిగే ప్రపంచ స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు మంచిర్యాల జిల్లాకు చెందిన కొలిపాక వెంకటేశ్వర్లు ఎంపికయ్యాడు. ఇటీవల హర్యానాలోజరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తచాటిన వెంకటేశ్వర్లు మెగాటోర్నీకి అర్హత సాధించాడు. గతంలో జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించడమే కాకుండా ‘మిస్టర్ తెలంగాణ’గా కూడా నిలిచాడు. అయితే కజకిస్థాన్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటేశ్వర్లుకు హీల్స్ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వాహకుడు డాక్టర్ రాజ్కిరణ్ రూ.50వేల చెక్కును మంగళవారం అందజేశారు.