వికారాబాద్ : రాత్రి పదకొండు గంటలు కావొస్తుంది. కాలనీలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో ఒక్కసారిగా ఓ వ్యక్తి ఓ యువకుడిని గన్ తో చూపించి బెదిరించాడు. దీంతో అదిరిపోయిన యువకుడు కాలనీలో పెద్దగా కేకలు వేశాడు. ఏం జరిగిందో అని భావించి కాలనీ వాళ్లంతా ఒక్కసారిగా బయటికి రావడంతో.. సదరు వ్యక్తి తనవద్దనున్న మారణాయుధాలు చూపిస్తూ వెళ్లిపోయాడు. గజగజ వణికి పోయిన బాధిత యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కమలా నగర్ కు చెందిన ఎం. ప్రణీత్ కుమార్ శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలనీ లో ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేస్తూ గౌలీ కార్ ఫంక్షనల్ వైపు టాయిలెట్ కు వెళ్లాడు. అదే సమయంలో కారులో నుంచి సాకేత్ నగర్ కు చెందిన షేక్ ఫయాజ్ హైమద్ కారులోంచి దిగుతూ ప్రణీత్ కుమార్ను నానా బూతులు తిట్టాడు.
అంతటితో ఆగకుండా తనవద్దనున్న ఎయిర్ గన్, కత్తితో ప్రణీత్ కుమార్ ను చంపేస్తా అంటూ బెదిరించాడు. భయపడిన ప్రణీత్ కుమార్ షేక్ ఫయాజ్ కు క్షమాపణలు చెబుతూ గట్టిగా అరిచాడు. దీంతో కాలనీవాసులు బయటికి వచ్చి చూడగా.. షేక్ ఫయాజ్ హైమద్ తన వద్ద ఉన్న మారణాయుధాలు చూపిస్తూ.. కారులో తన ఇంటికి వెళ్లి పోయాడు. ఈ విషయాన్ని ప్రణీత్ కుమార్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షేక్ ఫయాజ్ హైమద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నింధితుడి వద్ద నుంచి ఎయిర్ గన్, ఇతర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 2 సెల్ ఫోన్లు, కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షేక్ ఫయాజ్ అహ్మద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ని జిల్లా పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు షేక్ ఫయాజ్ అహ్మద్ ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి