టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) వుమెన్స్ హాకీ లో .. ఇవాళ జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై 4-3 గోల్స్ తేడాతో భారత జట్టు గెలిచింది. ఓయ్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ వందనా కటారియా ( Vandana Katariya ) హ్యాట్రిక్ గోల్స్ చేసింది. ఒలింపిక్స్లో హ్యాట్రిక్ కొట్టిన తొలి భారత క్రీడాకారిణిగా వందన రికార్డు క్రియేట్ చేసింది. అయితే గ్రూప్ ఏ లో భారత జట్టు తుది మ్యాచ్ను గెలిచినా.. క్వార్టర్స్లోకి ప్రవేశించే అవకాశం బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్పై ఆధారపడి ఉంది. గ్రూప్ ఏలో ఇండియా ఆరు పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 12, జర్మనీ 12, బ్రిటన్ 6 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలి అర్థభాగంలో రెండు జట్లు 2-2 గోల్స్తో సమంగా నిలిచాయి. అయితే రెండవ అర్థభాగం ఇండియన్ ప్లేయర్లు దూకుడు పెంచారు. మ్యాచ్ 49వ నిమిషంలో వందన కటారియా హ్యాట్రిక్ గోల్ కొట్టింది.