హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూటీటీ జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన బాలికల అండర్-11 బాలికల తుదిపోరులో షనాయ త్యాగి 1-10, 7-11, 11-8, 11-8తో వెంకట మహిమ కృష్ణ(తెలంగాణ)పై గెలిచింది.
బాలుర అండర్-11 ఫైనల్ ఫైట్లో ఆరివ్ దత్తా 9-11, 11-9, 11-4, 11-4తో క్రిష్ వినోద్పై గెలిచి ట్రోఫీలు సొంతం చేసుకున్నారు.