మోత్కూరు, ఏప్రిల్ 2: ప్రభు త్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించింది .ఇప్పటికే కల్పించిన 90 శాతం రాయితీతో పేరుకు పోయిన బకాయిలు చెల్లించుకునే అవకాశం కలిగింది. దీంతో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలయ్యాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఈ యేడాది రూ.12.7 7కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ.11.21 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలయ్యాయి. కొవిడ్-19 కారణంగా ప్రజలపై భారం పడకుండా ఉండటానికి ఆస్తి పన్ను చెల్లించుకోవడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. మరింత ప్రయోజనం కల్పించడానికి 50 శాతంరాయితీ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మోత్కూరు, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు మున్సిపాలిటీల పరిధిలో ఇంకా పేరుకుపోయిన బకాయిలు చెల్లించుకోవడానికి అవకాశం ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.1.05 కోట్లకు రూ.82.06 లక్షలు, భువనగిరిలో రూ.4.79కోట్లకుగాను రూ.4.74 కోట్లు, చౌటుప్పల్లో రూ.2.51కోట్లకుగాను రూ.2.02 కోట్లు, యాదగిరిగుట్టలో రూ.89. 92 లక్షలనుగాను రూ.74.45 లక్షలు, ఆలేరులో 2.02కోట్లకు గాను రూ.1.49కోట్లు, భూదాన్పోచంపల్లిలో రూ.1.53కోట్లకుగాను రూ.1.40కోట్ల బకాయిలు వసూలయ్యాయి. ఇంకా రూ.1.56 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 50 శాతం రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలకు మరింత అవకాశం దక్కింది.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు చెల్లించుకోవటానికి 50శాతం రాయితీ కల్పించడం వల్ల జిల్లాలో చాలా మందికి ప్రయోజనం కలుగనున్నది. ప్రజలు అవగాహన చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మేరకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాం. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రజాప్రతినిధులు సహకరించాలి.
-షేక్ మహమూద్, మున్సిపల్ కమిషనర్ మోత్కూరు
ఇవీ కూడా చదవండి..
కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించిన సిబ్బంది.. క్షమాపణలు చెప్పిన ఆరోగ్యశాఖ మంత్రి
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫైజర్, మోడెర్నా తొలి డోసే అత్యంత ప్రభావంతం..