న్యూఢిల్లీ: వచ్చే నెలలో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల కోసం భారత అథ్లెట్లు సన్నద్దం అవుతున్నారు. ఇవాళ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజూ భారత బృందానికి సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం బ్లూ, వైట్ కలర్ జెర్సీలను రూపొందించారు. ఇక మహాక్రీడల్లో పాల్గొనే సపోర్ట్ స్టాఫ్కు కూడా ప్రత్యేక సూట్లను డిజైన్ చేశారు. అంతకముందు ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి రిజిజు సమీక్ష భేటీని నిర్వహించారు. ఒలింపిక్స్ కోసం అథ్లెట్ల ప్రిపరేషన్ లాంటి అంశాలను చర్చించారు. క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు మంత్రి రిజిజు తెలిపారు.