దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కాల్ కొనసాగించాలని ప్రతిపాదించగా ఐసీసీ సైతం సమ్మతించింది. అయితే స్వల్ప మార్పులు చేసింది. మరోవైపు షార్ట్న్న్రు థర్డ్ అంపైర్ కూడా పరిశీలించి, నిర్ణయాన్ని ప్రకటించేలా ఐసీసీ కొత్త రూల్ తెచ్చింది. ఎల్బీడబ్ల్యూను అంపైర్ నాటౌట్గా ప్రకటించిన సమయంలో ఫీల్డింగ్ జట్టు డీఆర్ఎస్కు వెళితే.. 50 శాతం బంతి వికెట్లకు తగిలినట్టుగా తేలితే ఔట్గా వస్తుంది. ఒకవేళ సగం బంతి కన్నా తక్కువగా తగిలినట్టు తేలితే అంపైర్ కాల్ వచ్చి.. నాటౌట్ అన్న నిర్ణయమే నిలుస్తుంది. డీఆర్ఎస్లో అంపైర్ కాల్ అనేది తికమకగా ఉందని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించడంతో ఈ విషయం ఇటీవల తీవ్ర చర్చనీయాంశం కాగా.. నిబంధనను కొనసాగించేందుకే ఐసీసీ మొగ్గుచూపింది.