తాను కరోనా నుంచి కోలుకుంటున్నానని టీమ్ఇండియా క్రికెటర్, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా సోషల్మీడియాలో వెల్లడించాడు. మే 4న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఐతే అప్పటికంటే ఇప్పుడు బాగానే ఉన్నట్లు సాహా పేర్కొన్నాడు. 14రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత చేసిన పరీక్షల్లో రెండోసారి కరోనా పాజిటివ్గా తేలినట్లు వస్తున్న వార్తలపై సాహా క్లారిటీ ఇచ్చాడు.
రొటీన్ చెకప్లో భాగంగా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నాను. అందులో ఒకటి నెగెటివ్ రాగా మరొకటి పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయకండి అని సాహా కోరాడు.
‘నా క్వారంటైన్ పీరియడ్ ఇంకా ముగియలేదు. సాధారణ టెస్టింగ్లో భాగంగా రెండు పరీక్షలు జరిగాయి. వాటిలో ఒకటి నెగెటివ్ వచ్చింది. మరొకటి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం నేను చాలా బాగున్నాను. తప్పుడు కథనాలు/సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నానని’ సాహా శుక్రవారం ట్విటర్లో విడుదల చేసే ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.