న్యూఢిల్లీ: క్రికెట్పై కరోనా ప్రభావం ఇలాగే ఉంటే ఏకకాలంలో భారత్ నుంచి రెండు జట్లు బరిలోకి దిగడం కొనసాగుతుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ఈ విధానం వల్ల ఎక్కువ ద్వైపాక్షిక సిరీస్లు ఆడడంతో పాటు అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు బయోబబుల్ నుంచి ఉపశమనం లభిస్తుందని బుధవారం చెప్పాడు. కాగా కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలోనే జూలైలో ధవన్ సారథ్యంలో భారత మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల విధానంపై ధుమాల్ మాట్లాడాడు.