న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ( MS Dhoni ) .. ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించారు. అయితే ఎందుకు ఆ బ్లూ కలర్ మార్క్ను తొలగించారో ఆ సంస్థ వెల్లడించలేదు. బహుశా క్రికెటర్ ధోనీ తన ఫ్లాట్ఫామ్లో యాక్టివ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ధోనీ చివరిసారి ఈ ఏడాది జనవరి 8న ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అతను తన ట్విట్టర్ అకౌంట్ను వాడలేదు. ఆరు నెలల పాటు తన అకౌంట్లో లాగిన్ కాకుంటే, అప్పుడు ట్విట్టర్ సంస్థ బ్లూ బ్యాడ్జ్ కోసం మళ్లీ వెరిఫికేషన్ కోరుతుంది. గత ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అయ్యారు. చెన్నై జట్టు తరపున ప్రస్తుతం అతను ఐపీఎల్లో ఆడుతున్నాడు.