సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ స్పీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 41వ ఓవర్ రెండో బంతికి చెతేశ్వర్ పుజారా(8) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. వన్డౌన్లో వచ్చిన పుజారా ప్రత్యర్థి బౌలర్లు వేసే కళ్లుచెదిరే బంతులకు తీవ్రంగా తడబడ్డాడు. 54 బంతులు ఆడిన పుజారా కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టి 8 పరుగుల సాధించాడు.
మరో ఎండ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టాప్-3 వికెట్లను పడగొట్టిన కేన్సేన ఉత్సాహంతో ఉంది. వికెట్ కాపాడుకుంటూ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని భారత్ భావిస్తోంది. విరాట్కు జోడీగా ప్రస్తుతం రహానె క్రీజులోకి వచ్చాడు. 42 ఓవర్లకు భారత్ మూడు వికెట్లకు 91 పరుగులు చేసింది. కోహ్లీ(17), రహానె(3) క్రీజులో ఉన్నారు.