కరోనా బాధితులు దవాఖానకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయాడు. పాజిటివ్ వచ్చినవారు దవాఖానకు వెళ్లేందుకు తన రెండుకార్లను ఉచితంగానే తీసుకెళ్లే ఏర్పాటుచేసి ఔదార్యం చాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన గోడికార్ హిరోజి. వ్యాపారి హిరోజి.. తనకు ఉన్న రెండు కార్లను కరోనా బాధితులు దవాఖానలకు వెళ్లేందుకు ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు అవసరం ఉన్న బాధితులు ఫోన్ నంబర్ను సంప్రదించాలని మిత్రులకు, పలు గ్రూపుల్లో పోస్టుచేస్తూ ఆపదలో ఆదుకుంటున్నారు. డ్రైవర్ను తెచ్చుకోవాలని, అత్యవసరమైతే తానే వస్తానని ఆయన ప్రకటించడంపై సర్వత్రా అభినందనలు వస్తున్నాయి.