లోగో ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ త్వరలో అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. రెండు వందల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ గోల్ఫర్లు పాల్గొనే అవకాశమున్న తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) తొలిసీజన్ సెప్టెంబర్ 12న మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు ఎనిమిది రౌండ్ల పాటు పోటీపడనున్నాయి. టీపీజీఎల్ తొలి సీజన్ లోగోను శనివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. శ్రీనిధి యూనివర్సిటీ ఈ లీగ్కు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేస్తున్నది. హెచ్జీఏ వారు టీపీజీఎల్ లీగ్ మొదటి ఎడిషన్ ప్రకటించినందుకు అభినందనలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్జీఏ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, బీవీకే రాజు, విక్రమ్దేవ్రావు పలువురు పాల్గొన్నారు.