టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మారో పతకం ఖాయమయ్యింది. షూటర్ అవని లేఖారా ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఫైనల్స్కు చేరింది. క్వాలిఫికేషన్ మ్యాచ్లో 104.9, 104.8, 104.1 స్కోర్తో ఫైనల్స్కు క్వాలిఫై అయింది. దీంతో భారత్కు మరో లభించే అవకాశం ఉంది. ఆదివారం టీటీ ప్లేయర్ భవీనాబెన్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో టేబుల్ టెన్నిస్లో పతకం సాధించిన మొదటి ప్లేయర్గా భవీనా నిలిచారు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్లో ఉమెన్స్ షాట్పుట్లో దీపా మాలిక్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.