న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) కు తీవ్రమైన జ్వరం వచ్చింది. అతనికి గొంత నొప్పి కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ పరీక్షలో మాత్రం అతను నెగటివ్గా తేలినట్లు కుటుంబ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 7వ తేదీన టోక్యోలో జరిగిన ఈవెంట్లో నీరజ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరిన నీరజ్.. భారత్కు అథ్లెటిక్స్లో తొలి పసిడిని అందించాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన నీరజ్కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం దక్కింది. నీరజ్కు జ్వరం తగ్గడం లేదని, కానీ అదృష్టవశాత్తు అతనికి కోవిడ్ నెగటివ్ వచ్చినట్లు ఇవాళ తెలిపారు. ప్రస్తుతం అతను రెస్ట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.