టోక్యో: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రతిరోజు లక్షలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేల మంది కరోనా బారినపడి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నాయి. ఐపీఎల్ లాంటి టోర్నీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జరుగాల్సి ఉండి, ఈ ఏడాదికి వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా గత ఏడాది వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ను ఈ సారి ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టోక్యో 2020 అధ్యక్షురాలు షికో హషిమోటో వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే ఒలింపిక్స్కు విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించారు. ఇప్పుడు హషిమోటో చేసిన తాజా వ్యాఖ్యలతో జపనీయులకు కూడా ఒలింపిక్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదనిపిస్తోంది. అయితే దీనిపై జూన్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దండం పెడుతా మాస్కులు ధరించండి: ముంబై మేయర్
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!