న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పోలాండ్ ఓపెన్లో సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల ఫైనల్లో వినేశ్ 8-0తో క్రిస్టీనా బెరెజా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఫోగట్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఈ సీజన్లో వినేశ్కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. విశ్వక్రీడలకు ముందు ఈ టోర్నీ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని మ్యాచ్ అనంతరం వినేశ్ చెప్పింది.