భైంసా, మార్చి 23: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పీఆర్సీ వర్తింపుపై హర్షం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ టీచర్లు మంగళవారం ముఖ్యంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. అంగన్వాడీ సిబ్బంది, అర్చన, కవిత తదితరులున్నారు.
లోకేశ్వరం, మార్చి 23 : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి పీఆర్సీ వర్తింపజేయడంపై సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయుల సంఘం మండలాధ్యక్షురాలు ఫర్హానా బేగం, ఉపాధ్యాయులు సురేఖ, విజయ, ముత్తవ్వ, చందుతాయి, లత, కల్పన, ఆయాలు గంగవ్వ, శోభ తదితరులు పాల్గొన్నారు.