సిరిసిల్ల టౌన్, మే 3: సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అని మున్సిపల్ కౌన్సిలర్ కుడిక్యాల రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన కుసుమ లక్ష్మితకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60 వేల విలువైన చెక్కు ను లబ్ధిదారుకు అందజేశారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పినిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ నాయకులు కొలిపాక రాజేశం, భారత్ దత్తాద్రి, బంక సాయిరాం, బొల్లి బాలు ఉన్నారు.
ఇల్లంతకుంట, మే 3: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య పేర్కొన్నా రు. మండల కేంద్రంలోని జీపీ ఆవరణలో సోమవారం కూనబోయిన కార్తీక్కు రూ.60వేలు, కూనబోయిన సంతోష్కు రూ.17వేలు, నార్ల విద్యాసాగర్ రూ.7500, ఎ చంద్రయ్యకు రూ.16వేలు, డీ శ్యామలకు రూ.27వేల విలువైన చెక్కులను అందజేశారు. ఇక్కడ ఉప సర్పంచ్ సాదుల్, వార్డు సభ్యులు అంతగిరి భాస్కర్, మామిడి తిరుపతి, మైనార్టీ మండలాధ్యక్షుడు ఉస్మాన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కూనబోయిన రఘు, నాయకులు గడ్డం రవి, కనకయ్య, రామస్వామి, మామిడి నర్సయ్య ఉన్నారు.