షార్జా: ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. శనివారం పంజాబ్తో తలపడనుంది. ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశలో శనివారం తొలి డబుల్ హెడర్ జరుగనుండగా..మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సన్రైజర్స్.. పోతూ పోతూ మిగిలిన జట్ల అవకాశాలను దెబ్బతీయాలని చూస్తుంటే.. క్రితం మ్యాచ్లో విజయం అంచుల వరకు వచ్చి ఓటమి పాలైన పంజాబ్ ఈ పోరులోనైనా గెలువాలని భావిస్తున్నది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రాణించడంపైనే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.