కొలంబో: ఆల్రౌండ్ ప్రదర్శనతో వన్డే సిరీస్లో బోణీ కొట్టిన ధావన్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే ట్రోఫీ పట్టేసేందుకు సమాయత్తమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఘనవిజయం సాధించిన యువ భారత్.. శ్రీలంకతో మంగళవారం రెండో వన్డే ఆడనుంది. ఈ ఏడాది జరుగనున్న పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా ఆడుతున్న చివరి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే కాగా.. మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి వన్డేలో భారత లక్ష్యఛేదన గమనించిన వారికి ఇది వన్డేనా.. లేక టీ20నా అన్న అనుమానం రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పృథ్వీ షా ప్రత్యర్థిపై విరుచుకుపడితే.. క్రీజులోకి అడుగుపెట్టక ముందే డ్రెస్సింగ్ రూమ్లో సహచరులకు మాటిచ్చిన ఇషాన్ కిషన్ వన్డే అరంగేట్రంలో తొలి బంతికే సిక్సర్తో అదరగొట్టాడు. నయా సారథి శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. మరి జోరు మీద ఉన్న టీమ్ ఇండియాను లంక ఎలా అడ్డుకుంటుందో చూడాలి.