మహబూబ్నగర్ : చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకువస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పిల్లల మర్రి అభివృద్ధి పై ఆర్కాయాలజికల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో చరిత్రాత్మక పిల్లల మర్రి ( మహా వృక్షం) కు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆర్కియాలజీకల్ పార్క్ ను అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం లో చరిత్రాత్మక, వారసత్వ, సాంస్కృతిక సంపద పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మక, వారసత్వ, సాంస్కృతిక కళలకు పుట్టినిల్లుగా మంత్రి అభివర్ణించారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక సంపద ను వెలికితీసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పిల్లల మర్రి వద్ద ఆర్కాయాలజికల్ పార్కు ను అభివృద్ధి చేయుటకు రూపొందించిన వీడియో డాక్యుమెంటరీ ప్రతిపాదనలను పరిశీలించారు. పిల్లలమర్రిలో ఇప్పటికే పురావస్తు శాఖ ద్వారా మ్యూజియాన్ని ఏర్పాటు చేశామన్నారు.
మ్యూజియంకు అనుబంధంగా మరో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆర్కాయాలజికల్ పార్కును అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ పార్కులో అది మానవుని అవశేషాలను, శ్రీశైలం జలాశయంలో ముంపునకు గురైన దేవాలయాలు, కట్టడాల నమూనాలను ప్రదర్శించేందుకు ప్రదర్శన శాలను, హంపి థియేటర్ ను, పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు, సుమారు 500 పురాతన విగ్రహాలు, 20 ఫిరంగులు, 10 ద్వారా బంధతోరణాలు ప్రదర్శన చేసేందుకు ఈ పార్కును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్ రోహిత్ జోషి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి