హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరుస విజయాలతో జోరుమీదున్న తెలంగాణ యువ టెన్నిస్ ఆటగాడు గంటా సాయి కార్తీక్ రెడ్డి.. ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. టూనీషియా వేదికగా ఆదివారం ముగిసిన 15కే ఏటీఎఫ్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాయి కార్తీక్-పరీక్షిత్ జోడీ 6-3, 6-4తో సన్ క్యూ-టాంగ్ ఎస్ (చైనా) జంటపై గెలుపొందింది. మ్యాచ్ ఆసాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జంట వరుస సెట్లలో విజేతగా నిలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో సాయికార్తీక్-పరీక్షిత్ జోడీ 6-7 (6/8), 7-5, 10-5తో జోన్స్-కరణసింగ్ జంటపై.. క్వార్టర్స్లో 6-4, 6-4తో పోర్చుగల ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.