హైదరాబాద్, ఆట ప్రతినిధి: జపాన్ వేదికగా అక్టోబర్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ సన్నాహక శిబిరానికి రాష్ట్రం నుంచి ముగ్గురు జిమ్నాస్ట్లు ఎంపికయ్యారు. వచ్చే నెల 8 నుంచి ఢిల్లీలో మొదలయ్యే శిబిరంలో అరుణా రెడ్డి, సురభి, విశాల్ జాదవ్ పాల్గొననున్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారిని ప్రపంచ టోర్నీకి ఎంపిక చేయనున్నారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా మెగాటోర్నీకి ఎంపికై రాణించాలని రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, కుల్దీప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.