మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాది పొడవునా చెరువులు, కాల్వల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. పైగా ఉచిత చేప పిల్లల పంపిణీ పేరిట రాష్ట్రంలోని జలాశయాల్లోకి కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. ఫలితంగా తెలంగాణలో చేపల ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు ఆంధ్రాకే చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం చెరువులో పట్టిన చేపలను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు ఎగుమతి చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
కరోనా కట్టడికి స్పైడర్మ్యాన్ ఫైట్