వరంగల్ రూరల్ : ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామంలో రూ.7.66 కోట్లతో అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కామారం గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు రూ.4.56 కోట్లతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు, కామారం గ్రామ శివారులో రూ.3.10 కోట్లతో నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.