లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్యాచ్పై మంత్రి కేటీఆర్ ( KTR ) కొన్ని కామెంట్స్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఏదో మత్తు ఉందన్న విషయాన్ని ఆయన తన ట్వీట్లో వ్యక్తపరిచారు. బంతులు స్వింగ్ అయ్యే మైదానంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడితే ఆ గమ్మత్తే వేరుగా ఉంటుందని ఆయన తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
ఇక ఆ మ్యాచ్లో అండర్సన్ బౌలింగ్లో కెప్టెన్ కోహ్లీ ఆడిన తీరు అద్భుతమని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. అండర్సన్ స్వింగ్ బౌలింగ్ను కోహ్లీ ఎదుర్కొన్న తీరు ఉత్తమమన్నారు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన అమోఘ ప్రదర్శనతో ఆ మ్యాచ్కు ఎంతో వైభవాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్లో తన భావాలను వ్యక్తం చేశారు. నిన్న ప్రారంభమైన మ్యాచ్లో మొదటి రోజు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ చేశాడు. రాహుల్ 127 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు.