టోక్యో: ఇప్పుడంతా ఒలింపిక్స్ ( Tokyo Olympics ) టైమ్. పతకాలు ఎవరు గెలిచారన్నదే పెద్ద న్యూస్. ఇక కరోనా వేళ మహాక్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియాలు ప్రేక్షకులు లేకుండా వెలవెలబోతున్నాయి. క్రీడలు మహారంజుగానే సాగుతున్నా.. ప్రత్యక్షంగా చూసేవారు లేరు. కానీ అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్కు ఓ ప్రత్యేక అతిథి వచ్చారు. మహిళల మ్యాచ్ ను షూట్ చేస్తున్న అర్జెంటీ టీవీ ఛానల్ కెమెరామన్ .. మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింకను చూపించాడు. ఆటగాళ్ల నుంచి కెమెరాను మరో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్లో సంచరిస్తున్న బొద్దింకను లైవ్లో చూపించాడు. ఆ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ క్లిప్ షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఆ పోస్టును 70 లక్షల మంది చూశారు. 65వేల రీట్వీట్లు వచ్చాయి. లైవ్లో ప్రసారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. కానీ ఆ అతిథి మాత్రం ఆన్లైన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది.