బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ జ్యోతి చైనా రాజధాని బీజింగ్కు చేరింది. ‘ఒలింపిక్స్ బహిష్కరణ’ డిమాండ్పై కొనసాగుతున్న నిరసనల మధ్య జ్యోతి క్రీడా నగరానికి విచ్చేసింది. ఒలింపిక్ కాగడను బీజింగ్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కై కి స్వీకరించాడు. 2022 ఫిబ్రవరి 4-20 మధ్య క్రీడా సంబురాలు జరుగనున్నాయి. 2008లో ఒలింపిక్స్ నిర్వహించిన బీజింగ్ ఇప్పుడు వింటర్ విశ్వక్రీడలకు వేదిక అయ్యింది. 85 దేశాల నుంచి దాదాపు 2,900 మంది అథ్లెట్లు ఈ విశ్వ క్రీడా సంబురాల్లో పాల్గొననున్నారు.