హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ క్రీడా దినోత్సవాన్ని (ఆగస్టు 29) పురస్కరించుకొని హాకీ రంగారెడ్డి ఆధ్వర్యంలో అండర్-16 ముకేశ్ కప్ హాకీ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 జట్లు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీకి సంబంధించిన జెర్సీలను ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆవిష్కరించారు. దక్షిణ మధ్య రైల్వే గ్రౌండ్లోని ఆస్ట్రో టర్ఫ్పై ఈ పోటీలు జరుగనున్నాయి. 5ఏ సైడ్ నిబంధనలతో టోర్నీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, పారిజాత హోమ్స్ చైర్పర్సన్ అంజ య్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ.. ‘రియో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో దేశవ్యాప్తంగా హాకీకి క్రేజ్ పెరిగింది. ఈ జోరు ఇలాగే కొనసాగాలి’ అని అన్నారు.