ప్రపంచకప్లో భారత షూటర్ల జోరు
మహిళల 25 మీటర్ల పిస్టల్లో క్లీన్స్వీప్
ప్రతాప్ సింగ్ తోమర్కు రికార్డు స్వర్ణం
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మన వాళ్లు క్లీన్స్వీప్ చేశారు. చింకీ యాదవ్ స్వర్ణం సాధించగా.. రాహి సర్ణోబత్, మనూబాకర్కు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఫైనల్ 32తో సమమైన అనంతరం నిర్వహించిన షూట్లో చింకీ 4-3తో సర్ణోబత్పై గెలిచి స్వర్ణాన్ని పట్టేసింది. 28పాయింట్లు సాధించిన బాకర్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ముగ్గురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 50 మీటర్ల పైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో పసిడి పతకం దక్కించుకొని ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్లో ఈ విభాగంలో స్వర్ణం దక్కించుకున్న అతి పిన్నవయస్కుడిగా ఈ 20 ఏండ్ల షూటర్ రికార్డు లిఖించాడు. ఫైనల్లో 462.5 స్కోరుతో ప్రపంచ నంబర్వన్ ఇస్టావెన్ పెని (461.6, హంగేరి), స్టెఫెన్ ఓల్సెన్ (450.9, డెన్మార్క్)ను వెనక్కి నెట్టి తోమర్ టాప్లో నిలిచాడు. కాగా 9 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలతో పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.