న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లంకలో కొవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉన్నందున మూడు వన్డేలు, మూడు టీ20లను కేవలం ఒకే వేదిక వద్ద జరపాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది.
‘ఒకే వేదిక వద్ద సిరీస్ మొత్తాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ప్రేమదాస స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుందని అనుకుంటున్నాం. మ్యాచ్ల షెడ్యూల్ వరకు పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని’ లంక బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే సిరీస్ జూలై 13న ప్రారంభంకానుంది.